Showing posts with label క్రీ.పూ. 6 వ శతాబ్దిలోనే తెలంగాణా ఒక మహా జనపదం. Show all posts
Showing posts with label క్రీ.పూ. 6 వ శతాబ్దిలోనే తెలంగాణా ఒక మహా జనపదం. Show all posts

Monday, 23 September 2013

క్రీ.పూ. 6 వ శతాబ్దిలోనే తెలంగాణా ఒక మహా జనపదం

భారత దేశంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత ప్రాంతాల్లో తెలంగాణా ప్రాంతం ఒకటి

గోదావరి-మంజీర నదుల మద్యన గల తెలంగాణా ప్రాంతమున
(కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, మెదకు మరియు నేటి మహారాష్ట్రలో కలిసిపోయిన నాందేడ్ ప్రాంతాలు)  
 క్రీ.పూ. 6 వ శతాబ్దిలో  విలసిల్లిన 16 మాహాజనపదాల్లో "Assaka" ఒకటి.
ఈ 16 మహాజనపదాలు, నాగరికత విలసిల్లిన వివిధ జాతులతో కూడి ఉండినట్టివి.  

ఆ 16 మహాజనపదాలు:
1. అంగ 2.కోసల 3.కాశీ 4.మగధ 5.వ్రిజి 6.మల్ల 7.చెడి 8.వత్స
9.కురు 10.పాంచాల 11.మత్స్య 12.సురసేన 13.అస్సక 14.అవంతి 15.గాంధార 16.కాంభోజ

అస్సక రాజధాని బహుదాన్యపుర (నేటి భోధన్)
(కొందరు కరీంనగర్ లోని కోటిలింగాల అస్సక రాజధాని అని కూడా తలుస్తున్నారు) 
ఈ అస్సక(అశ్మక) ప్రాంతాన్ని 25 మంది రాజులు పాలించినట్లు  మత్స్యపురాణంలో చెప్పబడి ఉంది. 


ఆర్యభట్ట జన్మస్థానం తెలంగాణా 
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పుట్టింది కూడా అస్సక రాజ్యంలోనే అని చెప్పబడుతుంది 

అస్సక విశేషాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Assaka

కొందరు బర్మా తైలంగుల టపాను కొట్టి పారేసి కళ్ళెదుట కనిపిస్తున్న చరిత్ర (శాసన) సాక్ష్యాలను
కాదంటూ ఆంధ్ర ప్రదేశ్ లోని ఏవేవో ప్రాంతాలు చెప్పుకొచ్చారు (అసభ్య పదజాలాల ఆ వ్యాఖ్యలు చాలా ప్రచురించలేదు)    
మరి  క్రీ.పూ. 6 వ శతాబ్దికే మహా నాగరీకులై ఉన్న తెలంగాణా ప్రాంతపు వాసులు
బర్మా పోవటంలో సందేహమే లేదు.

 చరిత్ర దాచితే దాగేది కాదు - ఈనాడైన అది వెలుగు చూస్తుంది