tag:blogger.com,1999:blog-257284105593051480.post4342946051258300560..comments2023-04-10T13:34:59.784+05:30Comments on అక్షర సత్యాలు : అతిపురాతనం తెలంగాణా రాష్ట్ర పండుగలు మఠం మల్లిఖార్జున స్వామిhttp://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-257284105593051480.post-80801770302440591102014-06-30T14:19:18.913+05:302014-06-30T14:19:18.913+05:30అయ్యా,
1) వ్యాసం బాగుందని తెలిపినందులకు సంతోషము.
...అయ్యా,<br />1) వ్యాసం బాగుందని తెలిపినందులకు సంతోషము. <br /><br />2) ఇక వేపచెట్టు ప్రాశస్త్యం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒరిస్సా లాంటి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ నేడు కనిపిస్తుంది. అయినా వేప కొమ్మలు గుమ్మాలకి మంగళప్రదంగా వాడటమే కాక, వాటితో శివాలు ఊగటం, ప్రతినిత్యం పూజించటం వంటివి తెలంగాణాలో మాత్రమే కనిపించే ప్రత్యేకాంశాలు. <br /><br />3) శాకాహారము అన్న పద నిజరూపము శాకాహారము అని మీరన్నది సర్వజన విదితమే, కాని శాఖాహారము అని రాయటంలో దోషమేమీ లేదు, ఇలా ఎన్నో పదాలు వివిధ రూపాలలో రాయబడుతూ ఉండటం అనాది నుండి వాడుకలో ఉన్నదే. పదము యొక్క అర్థం మారకుండా చదువరికి ఆ పదము యొక్క అర్థం స్పష్టంగా తెలియబడినపుడు అక్షరాల మార్పుతో వచ్చే నష్టమేమీ లేదు అదీ కాక ఈ నెట్ ప్రపంచంలో రాయటానికి గ్రామర్ తో పనిలేదనేదే నా భావన. రాశాడు అన్నా వ్రాశాడు అన్నా, సమైక్యాంద్ర అన్నా సమైఖ్యాంద్ర అన్నా అర్థాల్లో ఏవిధమైన మార్పులూ జరగవు. కచటతపలు - గజడదబలు గా మారును అంటూ మొదలుగా గల వివరణలతో నన్నయభట్టే ఆంధ్రశబ్ద చింతామణి ని 11 శతాబ్దిలోనే రాయటం సర్వ విదితమే. కాలాన్ని భట్టి పదాల వాడుకలో మార్పులూ చేసుకోవటం సహజం - ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో పెద్ద పెద్ద పదాలు కూడా సౌలభ్యం కొరకు ఒకటి రెండు అక్షరాల్లోనే ఒదిగి పోతున్నాయి. <br /> <br /><br />4) రామాయణకాలం నాటికి ఆంధ్రుల ప్రస్తావన లేనేలేదు. ఆ కాలంలో ఈ దండకారణ్యంలో (ఇప్పటి తెలంగాణాలో) శబరులు, భిల్లులు, గోండులు నివసించేవారని సుష్పష్టంగా చెప్పబడి ఉంది, అరణ్యస్తులైన వీరి ప్రకృతి ఆరాధనలే తెలంగాణాలో నేటికీ పండగల రూపంలో కనబడుతున్నాయి. ఆంధ్రులు మగధ సామ్రాజ్యమును పాలించినట్లు పురాణము నందు ప్రస్తావించబడి ఉంది. ఉత్తరదేశంలోని ఈ మగధ రాజ్యాన్ని కాణ్వ వంశస్తుల పిదప, ఆంధ్ర వంశస్తులైన 32 మంది ఆంధ్ర రాజులు పరిపాలించినట్లు మత్స్య, వాయు, బ్రహ్మాండ, విష్ణు పురాణాల్లోనూ భాగవత పురాణంలోను వివరించబడి ఉంది. <br /><br />ఋగ్వేదము నందలి ఐతరేయ బ్రాహ్మణములో సుష్పష్టంగా ఆంధ్రుల ప్రస్తాన కలదు. విశ్వామిత్రుడు తన పుత్రులైన ఆంధ్రులను ఆర్యాశ్రమ సరిహద్దులలో అనార్యులతో కూడి నివసించుమని శపించినట్లు చెప్పబడి ఉంది. శాపానికి గురైన ఆంధ్రులు శాప కారణంగానే గంగానది పరివాహక ప్రాంతాన్నివీడి దక్షిణా ప్రాంతానికి వలస వచ్చారని తెలపబడింది. దాదాపుగా 99% ఆంధ్ర పండితులే గాక చరిత్రకారులూ తమ పరిశోధనల్లో ఈ విషయాలను రాయటం జరిగింది (ఆంధ్రుల చరిత్రకై తన జీవితాన్నే ధారబోసిన ప్రముఖ ఆంధ్ర కవి చిలుకూరి వీరభద్రరావు గారు కూడా తన ఆంధ్రులచరిత్రలో 3వ ప్రకరణమైన ఆంధ్రదేశ ప్రశంసలో ద్రువపరచటం జరిగింది. అంతే గాక ఆంధ్రపత్రికాది పత్రికలలోనూ, పలు ప్రత్యేక సంచికలలోనూ ఈ విషయాలు వివరించటం జరిగింది. ఎంతోమంది మహానుభావులు, ప్రముఖ ఆంధ్రపండితులు గ్రంధస్తం చేసిన విషయాలనే మీరు కుటిలవాదనగా అభివర్ణించటం, ఆ ఆంధ్రుల నందరినీ కుటిలులుగా చిత్రించటం మీ విజ్ఞతకే నిదర్శనం. వలస వాదనను మరుగు పరచాలనే ఉద్దేశ్యంతో అసలు మూలాలనే ప్రశ్నార్థకం చేయటం - వేదము, రామాయణము, పురాణాది గ్రందాల విషయాలనే తప్పు బట్టటం అవివేకమే అవుతుంది. ప్రధానంగా ఈ మూలాలనే తృణీకరించటం ఆంధ్ర-తెలంగాణాల విలీన సందర్భం నుండే (1955) మొదలైందిగా కనిపిస్తుంది. అలాంటివారు మరేదైనా బలమైన చారిత్రిక ఆధారాలను చూపినప్పుడే ఈ నవీన వాదన నిజమని ప్రపంచం విశ్వసిస్తుంది. ఇంతకంటే ఎక్కువగా ఈ విషయం గురించి ప్రస్తావించటం అనవసరం - ఫల శూన్యం. <br /><br />5) మల్లికార్జున అనే పదం మీరన్నట్లు ఒక విధంగా నిజమైనదే కాని అదే ప్రామాణికం అనటానికి వీల్లేదు. మల్లికార్జునునికి చెప్పబడిన ఎన్నో కథల్లో అది ఒకటి, దాని ప్రకారమే మీరు చెప్పిన మల్లిక + అర్జునుడు అనే సంధి ఏర్పడింది. కానీ దానికి పూర్వమే మల్లిఖార్జున పదం ప్రఖ్యాతిలో ఉన్నట్లు ప్రాచీన శాసనాల ద్వారా, గ్రంథాల ద్వారా తెలియబడుతుంది. ప్రస్తుత కాలంలోనూ మల్లిఖార్జున పదాన్ని బహుళంగానే ఉపయోగిస్తున్నారు. అదీ కాక నామవాచకాలు ఈ విధింగానే ఉండాలి అన్న నియమనిబంధనలు కూడా లేవు - ఉండవు. వెంకన్న అని పిలిచినా ఎంకన్న అని పిలిచినా, వీరన్న అని పిలిచినా బీరన్న అని పిలిచినా, రమణ అన్నా రమన అన్నా అర్థం ఒకే భావాన్ని స్ఫురిస్తుంది. ప్రాచీనంగా ఉపయోగించిన కొన్ని అక్షరాలు ఈనాటి పేర్లలో కనిపించకపోవడం ఈనాడు సామాన్యమై పోయింది. అదీ కాక పేరు అనేది పెద్దవారు మనకు దీవించి పెట్టేది - అది దోషం ఉన్నా సరిగా ఉన్నా దాన్ని అనుసరించటం, ఆమోదించటం మన విధి అని నేను విశ్వసిస్తాను. <br /><br />స్వస్తి. <br />మఠం మల్లిఖార్జున స్వామిhttps://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-90473246966048084702014-06-30T10:49:00.332+05:302014-06-30T10:49:00.332+05:30"శాకములు అంటే కూరగాయలు"
మా కుటుంబంలో &..."శాకములు అంటే కూరగాయలు"<br /><br />మా కుటుంబంలో "కూర" అనే మాట వాడరు, కూరగాయలతో చేసి అన్నంలో కలుపుకునే పదార్థాలను శాకం అనే అంటారు.. "ఈరోజు ఏమి శాకం" లాంటి మాటలు మా చిన్నప్పుడు సర్వసాధారణ.<br /><br />మా అమ్మ లాంటి వారికయితే "కూర" అనే పదం అస్సలు ఇష్టం లేదు. భోజనానికి బయటివారు (స్నేహితులు) వచ్చినప్పుడు వారి ముందర "అమ్మా ఇయ్యాల కూరేంది" లేదా "వచ్చే వాయలో కూర వడ్డించు" అంటే "మనం మాంసం తినం వారీ మనింట్లో అన్నీ శాకాలే కూర ఉండదు" అని కసిరేది.<br /><br />Thank you sir for reminding about those days!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-43296893458867816722014-06-29T20:51:04.085+05:302014-06-29T20:51:04.085+05:30అయ్యా,
మీ వ్యాసం బాగుంది.
వేప చెట్టును గూర్చి మ...అయ్యా, <br />మీ వ్యాసం బాగుంది. <br />వేప చెట్టును గూర్చి మీరువ్రాసింది ఆంధ్రప్రాంతంలోనూ నిజమే.<br /><br />ఆర్యులైన ఆంధ్రులు ఉత్తర భారతం నుండి ఈ ప్రాంతానికి రాక ముందు అంటూ వ్రాసారు. కాని ఆర్యులు వారు ఉత్తరధృవం నుండి భారతదేశానికి వలసరావటం అనే వాదన ప్రస్తుతం చరిత్రకారులు ఒప్పుకోవటం లేదు. ఆ కుటిల వాదం ఎన్నడో పరాస్తం అయింది. <br /><br />మీరు శాఖాహారము అన్న పదం వాడారు. దాని నిజరూపం శాకాహారము. శాకములు అంటే కూరగాయలు.<br /><br />అలాగే మీ పేరుకూడా తప్పుగా వ్రాస్తున్నారని అంటే కోపగించుకోకండి. మల్లికార్జునుడు కాని మల్లిఖార్జునుడు కాదు. మల్లిక + అర్జున => మల్లికార్జున అని ఈ రెండు సంస్కృతశబ్దాలమధ్యన సవర్ణదీర్ఘసంధి జరిగి మల్లికార్జున అవుతుంది. <br /><br />స్వస్తి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com